Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#InttelligentTeaser : పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్.కామ్ అంటున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. యువరత్న బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు.

#InttelligentTeaser : పేదోడికి ఫ్లాట్‌ఫాం.. ధర్మాభాయ్.కామ్ అంటున్న సాయి ధరమ్ తేజ్
, శనివారం, 27 జనవరి 2018 (17:19 IST)
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "ఇంటిలిజెంట్". ఈ చిత్రం టీజర్ శనివారం విడుదలైంది. యువరత్న బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. "ఖైదీ నంబర్ 150" చిత్రం తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంటిలిజెంట్‌ మూవీకి సి. కల్యాణ్ నిర్మాత. 
 
ఇటీవల బాలయ్య ప్రధాన పాత్రలో విడుదలైన 'జై సింహా' చిత్రానికి కూడా కళ్యాణ్ నిర్మాతగా ఉన్నారు. ఈ కనెక్షన్ తోనే 'ఇంటిలిజెంట్' చిత్ర టీజర్ బాలయ్యతో విడుదల చేయించారు. ఇటీవల 'ఇంటిలిజెంట్' చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో సగం మొహాన్ని ఇంటిలిజెంట్ అనే అక్షరాలతో కవర్ చేసేసి.. కాస్త మ్యాట్రిక్స్ తరహా ఫీల్ తెచ్చేందుకు ప్రయత్నించారు. 
 
ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిధరమ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ధర్మాభాయ్‌ (డాన్)గా నటించినట్టు తెలుస్తోంది. పెదోడికి ఫ్లాట్‌ఫాం ధర్మాభాయ్ డాట్ కాం అంటూ ఎమోషనల్‌గా చెపుతాడు. కాగా, ఈ మూవీ సక్సెస్ అటు సాయి ధరమ్‌కి, ఇటు వినాయక్, లావణ్య త్రిపాఠిలకు ఎంతో అవసరం. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారా? - నయనతార