Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారు: హీరో శివాజీ

ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు. తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగ

భజన చేసి అవార్డులు తీసుకుంటున్నారు: హీరో శివాజీ
, శనివారం, 18 నవంబరు 2017 (10:17 IST)
ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు.  తాజాగా ప్ర‌క‌టించిన‌ నంది పుర‌స్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపారు. టీడీపీకి చెందిన వారికే అవార్డులు ఇవ్వ‌డం న్యాయం కాదని మండిప‌డ్డారు. తనకు ఇలాగే గతంలో అన్యాయం జరిగిందన్నారు.
 
గ‌తంలో తాను న‌టించిన‌ మిస్స‌మ్మ సినిమా బాగా ఆడింద‌ని, అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంద‌ని కానీ అవార్డు రాలేదన్నారు. మిస్స‌మ్మ సినిమాకు త‌న‌కు ఉత్త‌మ న‌టుడిగా అవార్డు ఇవ్వాల‌ని 90 శాతం మంది క‌మిటీ స‌భ్యులు ఎంపిక చేస్తే కొంద‌రు అడ్డుకున్నారని, త‌న‌కు ఈ విష‌యంపై ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని గుర్తు  చేశారు. 
 
సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర భ‌జ‌న చేసి అవార్డులు తీసుకుంటున్నార‌ని విమర్శలు గుప్పించారు. అవార్డులు ఇవ్వాలంటే ఓ కమిటీ వేసి.. ప్రజల అభిప్రాయం సేకరించాకే అవార్డులు ఇవ్వాలని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీరకట్టులో అదిరిపోయిన సమంత.. స్టిల్స్ చూడండి