Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'సాహో' తర్వాత ప్రభాస్ వ్యవసాయం చేయడట.. ప్రేమకథలో నటిస్తాడట...

యంగర్ రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఈ సినిమా ష

'సాహో' తర్వాత ప్రభాస్ వ్యవసాయం చేయడట.. ప్రేమకథలో నటిస్తాడట...
, సోమవారం, 25 జూన్ 2018 (16:48 IST)
యంగర్ రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ 'అబుదాబి'లో జరుగనుంది. ఇదిలావుంటే, సాహో తర్వాత తదుపరి నటించేందుకు ఎలాంటి ప్రాజెక్టుకు ప్రభాస్ సంతకం చేయలేదు.
 
దీంతో 'సాహో' తర్వాత ఏం చేస్తారని ప్రభాస్‌ను మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ, ఈ చిత్రం షూటింగ్ తర్వాత ఏ వ్యాపారమో... వ్యవసాయమో చేసుకుంటానని చమత్కరించాడు. అయితే, సాహో షూటింగ్‌లో ఉండగానే ప్రభాస్ మరో చిత్రంలో నటించనున్నాడు. 
 
సాహో తర్వాత 'జిల్' మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి.. కథా వస్తువు ఏమై వుంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతూ పోతోంది.
 
1970 నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఆ కాలానికి సంబంధించిన సామాజిక వాతావరణాన్ని ప్రతిబింభించే సెట్స్‌ను కళాదర్శకుడు రవీందర్ తీర్చిదిద్దుతున్నారట. 
 
లవ్.. యాక్షన్.. ఫాంటసీ కలగలిసిన ఈ సినిమా చిత్రీకరణ కొంతభాగం యూరప్‌లో జరగనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆగస్టులో మొదలుకానుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ నయా చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా టాలీవుడ్ హీరోయిన్.. ఎవరు?