బొకేలు కొనే డబ్బులతో ఎవరికైనా పట్టెడన్నం పెట్టండి: మోహన్ బాబు
తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగడించిన మోహన్ బాబు... నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని టీఎస్ఆర్ లలి
తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగడించిన మోహన్ బాబు... నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ 'నవరస నటతిలకం' అనే బిరుదుతో సత్కరించనుంది.
ఈ సత్కారాన్ని స్వీకరించేందుకు విశాఖకు వచ్చిన మోహన్ బాబు.. తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. తనను అభినందించేందుకు విశాఖకు వచ్చే అభిమానులు పూలదండలు, బొకేలు తేవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బుతో అన్నార్తులకు పట్టెడన్నం పెట్టాలని, అదే తానెంతో సంతోషించే విషయం అవుతుందని అన్నారు.
ఈ 40 సంవత్సరాలూ ఎలా గడిచిపోయాయో తెలియడం లేదన్న మోహన్ బాబు, ఇప్పుడు తనతో పనిచేసిన వారంతా వచ్చి అభినందనలు చెబుతుంటే వాటిని స్వీకరిస్తూ, ఆనందంగా ఉన్నానని చెప్పారు. ముఖ్యంగా తన గురువు దాసరితో పాటు అభిమానుల అండదండలతోనే ఇంతటివాడిని అయ్యానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.