ఆస్కార్ బరిలో తమిళ సినిమా... సి.కళ్యాణ్ ట్విస్ట్... ఏంటది?
ఈ ఏడాది ఆస్కార్ బరిలో తమిళ సినిమా ఎంపికైంది. ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఫారిన్ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి ఓ సినిమాని ఎంపిక చేసి పంపుతారు. ఈ బాధ్యత ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. ఈ ఫెడరేషన్ ఈ సంవత్సరం భారత్ నుంచి 'విశా
ఈ ఏడాది ఆస్కార్ బరిలో తమిళ సినిమా ఎంపికైంది. ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఫారిన్ ఫిలిం కేటగిరీలో భారత్ నుంచి ఓ సినిమాని ఎంపిక చేసి పంపుతారు. ఈ బాధ్యత ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. ఈ ఫెడరేషన్ ఈ సంవత్సరం భారత్ నుంచి 'విశారణై' అనే తమిళ చిత్రాన్ని ఆస్కార్ బరికి ఎంపిక చేసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ కేతం మెహతా ప్రకటించారు.
ఈ చిత్ర కథ ఓ ఆటో డ్రైవర్ తన స్వీయ అనుభవాలతో రాసిన 'లాక్ అప్' అనే నవల ఆధారంగా దర్శకుడు వెట్రి మారన్ తెరకెక్కించాడు. ప్రముఖ నటుడు ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో పోలీసుల అకత్యాలు, లంచగొండితనం, న్యాయం ఓడిపోవడం వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శలకుల మన్ననలను కూడా పొందింది. ఈ చిత్రం జాతీయ అవార్డు పొందడంతో పాటు 72వ వెనీస్ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది. కాగా ఈ చిత్రాన్ని తమిళ వ్యక్తి ఎవ్వరూ చూడలేదనీ, తమిళేతర వ్యక్తులంతా చూసి ఈ చిత్రాన్ని ఎంపిక చేసినట్లు మెహతా తెలిపారు. ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలుగులో విడుదల చేయబోతున్నారు. మొత్తమ్మీద పబ్లిసిటీ అలా వచ్చేస్తుందన్నమాట.