బాహుబలి 2 హక్కులు సాధించిన ప్రొడ్యూసర్ పైన 9 గంటల పాటు ఐటీ దాడులు
అగ్ర హీరోలతో సినిమాలు తీసే నిర్మాతల్ని చిత్ర కలెక్షన్లు ఆహా! ఓహో! అనేలా ప్రకటించినప్పుడు వారి ఆస్తులపై ఇన్కమ్టాక్స్ దాడులు జరుగుతుంటాయి. అలాంటి దాడి.. బుధవారం నాడు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కార్యాలయంలో జరిగింది. దాదాపు 9గంటల పాటు ఐటీ అధికారులు
అగ్ర హీరోలతో సినిమాలు తీసే నిర్మాతల్ని చిత్ర కలెక్షన్లు ఆహా! ఓహో! అనేలా ప్రకటించినప్పుడు వారి ఆస్తులపై ఇన్కమ్టాక్స్ దాడులు జరుగుతుంటాయి. అలాంటి దాడి.. బుధవారం నాడు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కార్యాలయంలో జరిగింది. దాదాపు 9గంటల పాటు ఐటీ అధికారులు దాడి చేసి.. పలు ప్రశ్నలను సంధించారు. మణికొండలోని కార్యాలయంలోనూ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటిలోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి.
రాజమౌళి కుటుంబానికి సన్నిహితుడయిన సాయి కొర్రపాటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. రాజౌళితో 'ఈగ', నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్తో 'ఊహలు గుసగుసలాడే చిత్రాలతోపాటు 'మనమంతా', 'జ్యో అచ్యుతానంద' వంటి పలు సినిమాలు నిర్మించారు. తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు వచ్చేలా సినిమాలు చేయడం ఆయన పాలసీ. దానికితోడు తాజాగా 'బాహుబలి 2' సినిమాను కొన్ని ఏరియాలకు హక్కులు సంపాదించారు.
కాగా, ఆదాయానికి సంబంధించిన మూలాలపైనా.. అకౌంట్స్లో కనిపిస్తున్న తేడాలపై అనుమానాలతో ఆయన్ను ప్రశ్నించారు. ఆ తర్వాత వాటి వివరాలను తెలియచేయలేదు. ఏదిఏమైనా.. అగ్ర నిర్మాతల లిస్టులో సాయి కొర్రపాటి చేరాడు. ప్రస్తుతం ఆయన నాలుగు లోబడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు.