Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాహసం చేయరా డింభకా అంటూ ‘మాయాద్వీపం’, అక్టోబరు 3 నుండి

సాహసం చేయరా డింభకా అంటూ ‘మాయాద్వీపం’, అక్టోబరు 3 నుండి
, సోమవారం, 27 సెప్టెంబరు 2021 (17:50 IST)
అనగనగా ఒక ద్వీపం. ఆ ద్వీపం పేరు వింటేనే చలి జ్వరం వస్తుంది. కాళ్ళు ముందుకు అడుగు వేయడానికే సహకరించవు. పశు పక్షాదులు కూడా దూరని కారడివి. ఆ ద్వీపంలో అడుగడుగునా ఆటంకాలు. ఒకవేళ ఆ ఆటంకాలను ఛేదించుకుంటూ సొరంగమార్గంలో వెళితే పాతాళలోకం చేరుకుంటారు. అక్కడ ఉంది ఒక అద్భుత ద్వీపం. ఈ కథ అంతా ఎక్కడో విన్నట్టు, చూసినట్టుంది కదా? ఎందుకంటే ఈ కథ మన 'మాయాద్వీపం' కథ.
 
అవును, మన ఎంతో ప్రియమైన  జీ తెలుగు 7 ఏళ్ళ తర్వాత ఈ షోని మరోసారి అందరిముందుకు తేనుంది. అంతేనా, తెలుగు టెలివిజన్‌కు అన్నయ్య అయిన ఓంకార్ ఈ షో ద్వారా మళ్లీ మన చానల్‌కి వస్తున్నారు. ఆయనతోపాటు మన అందరికి ఎంతో ఇష్టమైన పిల్లమర్రిరాజు, ఒంటికన్ను రాక్షసుడు ఈ ఆదివారం, అంటే అక్టోబర్ 3 నుంచి రాత్రి 9:00 గంటలకు మన ముందుకు వస్తున్నారు.
 
ఏడేళ్ల క్రితమే మాయాద్వీపం సెట్స్‌ని అందరూ ఎంతో మెచ్చుకున్నారు. అది మళ్లీ మన ముందుకు వస్తుంది అంటే ఛానల్, ఓంకార్ టీం సెట్స్‌ని ఇంకెంత ఘనంగా తీర్చిదిద్ది ఉండొచ్చు. అవునండి - తెలుగు టెలివిజన్లో కనీవిని ఎరుగనంతగా, మునుపెన్నడూ ఏ నాన్-ఫిక్షన్ టీం చేయని విధంగా మాయాద్వీపం సెట్ ఉండబోతుంది. ‘న భూతో న భవిష్యత్’ అనేంత రీతిలో ఉండబోతుంది. అలా అంగరంగ వైభవంగా సెట్స్ ఉండడానికి 100 మంది టెక్నీషియన్స్ 50 రోజులు పైగా  పగలు రాత్రి కష్ట పడి, మన కోసం ఎంతో వైవిధ్యమైన సెట్స్ ని రూపాందించారు.
 
మాయాద్వీపం యాంకర్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, "మాయాద్వీపం నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్‌గా మారింది ఈ షో తోనే. ఈ షో ఇచ్చిన ధైర్యం తోనే ఎన్నో షోస్ నిర్మించాను. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మళ్లీ నేను ఈ షోని అందరిముందుకు తీసుకొస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అంతకుమించి, అందరికి ఎంతో ఇష్టమైన 'పిల్లమర్రిరాజు' మరియు 'ఒంటి కన్ను రాక్షసుడు' ని మరోసారి అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంతే కాకుండా, అభిమానులందరినీ మరోసారి మాయా ప్రపంచం లోకి తీసుకెళ్లేందుకు అద్భుతమైన సెట్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి సెట్స్ ఇప్పటివరకు ఏ తెలుగు టెలివిజన్ నాన్-ఫిక్షన్ షోలో చూసి ఉండరు. అలాగే, ప్రోమో చూసిన తర్వాత వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ షో అందరికి నచ్చుతుందని, ఇప్పుడున్న పిల్లలకి కూడా మేము ఇంకా దగ్గరవుతామని భావిస్తున్నాను."
 
ఈ షోకి కంటెస్టెంట్స్‌గా 6 - 12 ఏళ్ళ చిన్నారులు రావడం జరిగింది. ఈ పిల్లలని డిజిటల్ ఆడిషన్స్ పద్థతిలో సెలక్ట్ చేయడం జరిగింది. మాయాద్వీపం ఆడిషన్స్ అనగానే 12000+ పైగా ఎంట్రీస్ పంపారు. ఆడిషన్స్ ఈ లెవెల్లో ఉంటే మరి ఆట ఎలా ఉంటుందో ఊహించండి. ప్రతి ఎపిసోడ్‌కి నలుగురు కొత్త కంటెస్టెంట్స్. ఆ నలుగురిలో ఎవరు చాకచక్యంగా, వారి తెలివితేటలతో, జ్ఞాపకశక్తితో పాతాళ లోకం చేరుకొని ఒంటి కన్ను రాక్షసున్ని సంహరిస్తారో వారికే 'అద్భుతదీపం' దక్కుతుంది. చదువుతుంటే చూడాలి అనిపిస్తుంది కదా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం, జీ తెలుగులో ఈ ఆదివారం ‘మాయాద్వీపం’ చూసేయ్యండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 12న విడుద‌ల‌వుతున్న నాగశౌర్య - లక్ష్య