Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీనేజ్ అమ్మాయిలా నలభై యేళ్ళ హీరోయిన్, ఎవరు?

టీనేజ్ అమ్మాయిలా నలభై యేళ్ళ హీరోయిన్, ఎవరు?
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:51 IST)
ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ మళయాళంలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు మంజు వారియర్. ఆమె 1995లో వచ్చినా సాక్ష్యం అనే మలయాళం సినిమాలతో తన సినిమా కెరీర్‌ను మొదలెట్టారు. అప్పుడు మంజువారియర్ వయస్సు దాదాపు 17 సంవత్సరాలు.
 
ఆ తరువాత ఎన్నో మలయాళం సినిమాల్లో నటించారు. మంజువారియర్ మంచి డ్యాన్సర్ కూడా. తన డ్యాన్స్‌కు ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకున్నారు. 17 సంవత్సరాలకు తన కెరీర్‌ను మొదలుపెట్టిన మంజు వారియర్ 18 సంవత్సరాలప్పుడు సల్లప్పం అనే సినిమాలో నటించారు.
 
ఆ సినిమాలో హీరోగా నటించిన దిలీప్‌ను 1998లో పెళ్ళి చేసుకున్నారు. వారిద్దరికి మీనాక్షి అనే పాప కూడా ఉంది. పెళ్ళయిన తరువాత మంజువారియర్ ఎక్కువగా సినిమాలు చేయలేదు. 2012లో గురువాయిర్ శ్రీక్రిష్ణ ఆలయంలో కూచిపూడి ప్రదర్సన ఇచ్చారు మంజు వారియర్.
 
అయితే ఆమె 2014 నుంచి సినిమాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం చతుర్ముఖం సినిమా చేస్తున్న మంజు ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో టీనేజ్ గర్ల్‌గా కనిపించింది. 42 యేళ్ళ వయస్సులో స్కూల్ పిల్లలాగా ఉన్న ఆమెను చూసి అభిమానులు షాకయ్యారు. ధనుష్‌తో కలిసి అసురన్ సినిమాలో కూడా చేశారు మంజు. స్టైలిష్, క్యూట్ లుక్‌తో వయస్సు కనబడకుండా మేనేజ్ చేస్తోందట మంజు వారియర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రామసేతు'కు కరోనా దెబ్బ.. అక్షయ్‌తో పాటు 45 మందికి కోవిడ్ పాజిటివ్