Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోర్బ్స్ జాబితాలో ఫిదా సాయిపల్లవి..

ఫోర్బ్స్ జాబితాలో ఫిదా సాయిపల్లవి..
, శనివారం, 8 ఫిబ్రవరి 2020 (15:26 IST)
''ఫిదా''తో అందరినీ ఫిదా చేసిన సాయిపల్లవి ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాలో నటిస్తోంది. నీది నాది ఒకే కథ ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా జానపదాలు పాడే మహిళగా కనిపించనుందని సమాచారం. 
 
అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నాగచైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ రెండు సినిమాలు తప్ప.. సాయి పల్లవి చేతిలో తమిళ సినిమాలు కూడా ఏమీ లేవని సమాచారం. ఆ మధ్య తమిళంలో సూర్య సరసన నటించిన 'ఎన్‌జీకే' చిత్రంలో సాయి పల్లవి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అలరించలేకపోయింది. 
 
అంతకుముందు ధనుష్‌తో జతకట్టి ఆడి పాడిన 'మారి 2' సినిమా మంచిగానే ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమాలో 'రౌడీ బేబి' పాట యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించి రికార్డ్స్ సృష్టించింది. ప్రస్తుతం అవకాశాలు లేకపోయినా సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు చేరింది. 
 
సాయిపల్లవి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌ తాజాగా ముప్పై సంవత్సరాలలోపు తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను పొందిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. అందులో భాగంగా వినోదరంగంకు సంబందించి 27 సంవత్సరాల సాయి పల్లవి చోటు సంపాదించుకుంది. దీంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నటి ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి.. నిశ్శబ్ధం ఎప్పుడో తెలుసా?