Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో షారూఖ్ చేసిందేమిటి?

లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో షారూఖ్ చేసిందేమిటి?
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (22:41 IST)
గానకోకిల లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని మోదీ సహా ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఆమెకు నివాళి అర్పించారు. అయితే, నివాళి అర్పించే సమయంలో షారుఖ్ చేసిన ఒక పని విమర్శలపాలయింది.
 
తన మేనేజర్ పూజ దద్లానీతో కలిసి ఆయన నివాళి అర్పించారు. పూజ చేతులు జోడించి నివాళి అర్పించగా... షారుఖ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం దువా చేశారు. అయితే ఆ సందర్భంగా లత పాదాల వద్ద షారుఖ్ ఉమ్మేశాడంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే, ఇక్కడే విమర్శకులు ఒక విషయాన్ని మర్చిపోయారు.
 
ఇస్లాం సంప్రదాయం ప్రకారం షారుఖ్ గాలి ఊదారు. దువాను చదువుతూ ఆమె భౌతికకాయంపై షారుఖ్ గాలి ఊదారు. ఆమె ఆత్మ సురక్షితంగా ఉండేందుకు, మరో జన్మలో కూడా ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని షారుఖ్ ఇలా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్న ప్రిన్స్, ఎలా?