Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిట్ కాయిన్ స్కామ్ కేసు : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిని అటాచ్ చేసిన ఈడీ

Shilpa Shetty

వరుణ్

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (14:18 IST)
బిట్ కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ముంబై జుహూ ఏరియాలో ఉన్న ఆమె ఫ్లాట్‌ను అటాచ్ చేశారు. దీంతో పాటు పూణెలో ఓ బంగ్లా సహా రూ.98 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గురువారం అధికారులు అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. 
 
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై బిట్ కాయిన్ పోంజి స్కామ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్‌తో పాటు పూణెలో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరిట ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి. ప్రివిన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 2002 కింద అధికారులు ఈ అటాచ్ నోటీసులు జారీ చేశారు. 
 
ఫోర్న్ రాకెట్ కేుసలో కూడా కుంద్రా నిందితుడే... 
సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లుగా కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతులను బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని రాజ్ కుంద్రాపై పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణం కూడా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసులోకి ప్రవేశించా4రు. కేసు దర్యాప్తులో భాగంగా, రాజ్ కుంద్రా తన పేరు మీ ఉన్న విలువైన ఆస్తులను భార్య శిల్పాశెట్టి పేరు మీదకు బదిలీ చేసినట్టు గుర్తించిన ఈడీ అధికారులు ఆ ఆస్తులను ఆటాచ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటుడు ధనుష్‌తో నాకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరం : నటి మీనా