Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాహో చిత్రాన్ని మరోమారు చూడండి... మరింతగా ఎంజాయ్ చేస్తారు : డైరెక్టర్ సుజిత్

సాహో చిత్రాన్ని మరోమారు చూడండి... మరింతగా ఎంజాయ్ చేస్తారు : డైరెక్టర్ సుజిత్
, మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (17:40 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత నటించిన తాజా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వం వహించగా యువీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్. అయితే, ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గత శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 
కానీ, ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ లేదా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రెండేళ్ళ పాటు ఎంతో శ్ర‌మించి తెర‌కెక్కించారు. అయితే, ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావ‌డంతో ఫ్యాన్స్ కూడా చాలా హ‌ర్ట్ అయ్యారు. కొన్ని చోట్ల విధ్వంసం కూడా సృష్టించారు. అయితే చిత్ర రిజ‌ల్ట్‌పై ప్ర‌భాస్ కాని, సుజీత్ కాని స్పందిస్తారేమోన‌ని ఎదురు చూస్తున్న క్ర‌మంలో ద‌ర్శ‌కుడు సుజీత్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ‌పు పోస్ట్ చేశారు. 
 
"నేను 17 ఏళ్ళ వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ల‌ఘు చిత్రం తెర‌కెక్కించాను. ఆ స‌మ‌యంలో డ‌బ్బులు లేవు. ఒక టీం లేదు. కేవ‌లం నా ఫ్యామిలీ, ఆర్కుట్ ఇవి రెండు మాత్ర‌మే నాకు మ‌ద్దతుగా ఉండేవి. నా ల‌ఘు చిత్రాల‌కి 90 శాతం ఎడిటింగ్‌, దర్శకత్వం‌, కెమెరా వ‌ర్క్ నేనే చేశాను. ఆ స‌మ‌యంలో నేను చేసిన త‌ప్పుల నుండి చాలా నేర్చుకున్నాను. విమ‌ర్శ‌కుల విమ‌ర్శ‌లు నాకు ఎల్ల‌ప్పుడు ఓ ప్రోత్సాహంలాగా అనిపిస్తుంటుంది. 
 
చాలా దూరం ప్ర‌యాణించి, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. కానీ సాధించాల‌నుకున్న‌ది ఎప్పుడు వ‌దిలి పెట్ట‌లేదు. ఈ రోజు 'సాహో' చిత్రాన్ని కొంత మంది ప్ర‌జ‌లు చూశారు. ఈ చిత్రం నుండి కొంద‌రు చాలా ఆశించారు. కొంద‌రు చాలా ఇష్ట‌ప‌డ్డారు. సినిమా చూసిన వారంద‌రికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మీరు ఏదైన మిస్ అయితే మ‌రొక‌సారి సినిమా చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తార‌ని నేను హామీ ఇస్తున్నాను' అని సుజిత్ తన పోస్టులో కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అట్టర్ ప్లాఫ్ అవుతున్న బిగ్ బాస్ 3.. తుస్సుమన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ