Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూరీ మీద పోటీ కోసం కాదు.. రామ్‌తో పోటీ కాదు : హరీశ్ శంకర్

harish shankar

వరుణ్

, సోమవారం, 29 జులై 2024 (12:44 IST)
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. మాస్ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఆదివారం ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్, రామ్ పోతినేనిల 'డబుల్ ఇస్మార్ట్'కు పోటీగా 'మిస్టర్ బచ్చన్' వేస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా హరీష్ శంకర్ బదులుగా సమాధానమిచ్చారు. 
 
'పూరి జగన్నాథ్‌తో నన్ను ఎప్పుడు పోల్చుకోను. అయన ఓక లెజెండరీ డైరెక్టర్. ఆయనతో ఎప్పుడు పోటీ పడను. ఓటీటీ సంస్థల ఒత్తిడి వలన అనుకున్న డేట్ కంటే కొద్దిగా ముందుకురావడంతో అనుకోకుండా డేట్ క్లాష్ అవుతోంది. ముందుగా 'డబుల్ ఇస్మార్ట్' డేట్ వేశారు. కానీ మాకు ఫైనాన్షియాల్ కారణాల వలన అదే డేట్‌కు వస్తున్నాం. ఒక్క సినిమా క్లాష్ వలన పూరికి నాకు మాటలువుండవ్ అని నేను అనుకోను. అయనా అనుకోరు. 
 
ఆగస్టు 15న రిలీజ్ చేయమని సలహా ఇచ్చింది మైత్రీమూవీస్ శశి. పూరి మీద పోటీ కోసం కాదు, రామ్‌తో పోటీ కాదు, నా తర్వాత సినిమా రామ్‌తో చేయబోతున్నాను అలాంటప్పుడు క్లాష్‌కు ఎందుకు వెళ్తాను, మేము తప్పక రావాల్సివస్తుంది. అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. "మిస్టర్ బచ్చన్", "డబుల్ ఇస్మార్ట్" రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిధరమ్ తేజ్ - మెహ్రీన్ ప్రేమలో వున్నారా? నిజమెంత?