Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భావనపై లైంగికదాడికి 2013లోనే స్కెచ్. 1.5 కోట్లు ఇచ్చిన దిలీప్

గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు బీజం వేసిన మలయాళ స్టార్ హీరో కేవలం వ్యక్తిగత కక్ష్యతోనే ఆమెపై దాడికి కుట్ర పన్నినట్లు పోలీసు విచారణలో స్పష్టమైంది. ఈ కేసులో అరెస్టయిన మలయాళ అగ్రహీరో దిలీప్‌ వ్యక్తి

భావనపై లైంగికదాడికి 2013లోనే స్కెచ్. 1.5 కోట్లు ఇచ్చిన దిలీప్
హైదరాబాద్ , గురువారం, 13 జులై 2017 (09:34 IST)
గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు బీజం వేసిన మలయాళ స్టార్ హీరో కేవలం వ్యక్తిగత కక్ష్యతోనే ఆమెపై దాడికి కుట్ర పన్నినట్లు పోలీసు విచారణలో స్పష్టమైంది. ఈ కేసులో అరెస్టయిన మలయాళ అగ్రహీరో దిలీప్‌ వ్యక్తిగత కక్షతోనే హీరోయిన్‌పై దాడికి కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను కోర్టు రెండురోజుల విచారించేందుకు కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. నటిపై కారులో లైంగిక వేధింపులు చోటుచేసుకున్న త్రిశూర్‌ ప్రాంతానికి దిలీప్‌ను తీసుకెళ్లి ఇంటరాగేషన్‌ చేసి.. కీలక ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
 
ప్రముఖ నటి అపహరణ, కారులో లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన మలయాళ అగ్రహీరో దిలీప్‌ వ్యక్తిగత కక్షతోనే హీరోయిన్‌పై దాడికి కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను కోర్టు రెండురోజుల విచారించేందుకు కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. నటిపై కారులో లైంగిక వేధింపులు చోటుచేసుకున్న త్రిశూర్‌ ప్రాంతానికి దిలీప్‌ను తీసుకెళ్లి ఇంటరాగేషన్‌ చేసి.. కీలక ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
 
2013లోనే నటిపై దాడి కుట్రకు బీజం పడినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. 2013లో దిలీప్‌ ఓ వ్యక్తికి రూ. 1.5 కోట్లు ఇచ్చి.. నటిపై దాడి చేసి ఆ ఘటనను రికార్డు చేయాలని, ఆమెను నగ్నంగా ఫొటోలు తీయాలని కోరాడని ఆ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగతంగా నటిపై పగ తీర్చుకోవడానికి ఆయన ఈ కుట్రకు తెరతీశాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తన మొదటి భార్య మంజు వారియర్‌తో వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడానికి కారణం నటియేనన్న కారణంతో ఆయన పగ పెంచుకున్నారని తెలుస్తోంది. 
 
కావ్యా మాధవన్‌తో తనకు ఉన్న ఎఫైర్‌ గురించి మంజు వారియర్‌కు నటి చెప్పడంతోనే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. మంజు వారియర్‌తో విడిపోయిన అనంతరం ఇటీవల దిలీప్‌ కావ్యా మాధవన్‌ను పెళ్లాడారు. వ్యక్తిగత పగతోనే నటిపై ఇంతటి అమానుష దాడి చేయించాడని పోలీసులు ఆరోపిస్తుండగా.. తనను ఈ కేసులో కావాలనే ఇరికించారని నటుడు దిలీప్‌ అంటున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంటిపై ఆచ్చాదనే లేని హీరోయిన్.. అన్నీ వదిలేసిన అమీ