Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఆర్ఆర్ఆర్" కోసం "రిలీజ్ డేట్‌"ను త్యాగం చేస్తానంటున్న నిర్మాత!

, ఆదివారం, 30 జనవరి 2022 (12:18 IST)
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మితమైన "ఆర్ఆర్ఆర్" చిత్రం. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురావాల్సివంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా ఆంక్షలు, రాత్రిపూట కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ వంటి కారణాలతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో విడుదల చేయనున్నట్టు తాజాగా ఆ చిత్రం నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడించారు. 
 
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవగణ్ వంటి భారీ తారాగణం నటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ స్థాయి పెరగాలని, ఇందుకోసం పాన్ ఇండియా సినిమాలు విడుదల కావాలని కోరారు. ఈ విషయంలో తన చిత్రాల విడుదల తేదీలను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇందులోభాగంగా తన చిత్రం "ఎఫ్-3"ని విడుదలను వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
"ఆర్ఆర్ఆర్" చిత్రానికి మార్చి 18, ఏప్రిల్ 28వ తేదీ అనే రెండు తేదీలను ప్రకటించారు. మా ఎఫ్-3 28వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఒకవేళ "ఆర్ఆర్ఆర్" చిత్రం ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తే మాత్రం తమ చిత్రాన్ని వాయిదా వేస్తామని తెలిపారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే. అందరూ కూర్చొని విడుదల తేదీలపై చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంపుడు కుక్క రైమ్‌తో ముంబైలో హీరో రామ్ చరణ్