Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'భారతీయుడు' సీక్వెల్.. బడ్జెట్ రూ.180 కోట్లు.. దిల్ రాజు వెల్లడి

తమిళ దర్శకుడు ఎస్.శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భారతీయుడు. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారతీయుడు గెటప్‌లో కమల్ లంచం తీసుకునే

'భారతీయుడు' సీక్వెల్.. బడ్జెట్ రూ.180 కోట్లు.. దిల్ రాజు వెల్లడి
, సోమవారం, 2 అక్టోబరు 2017 (06:41 IST)
తమిళ దర్శకుడు ఎస్.శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భారతీయుడు. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భారతీయుడు గెటప్‌లో కమల్ లంచం తీసుకునే అవినీతి పరుల పనిపడతారు. అయితే అప్పట్లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే కాదు, పలు అవార్డులు, రివార్డులను కూడా కైవసం చేసుకుంది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2'ను శంకర్ తెరకెక్కించనున్నారు. 
 
ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు తెలిసింది. మొదటి పార్ట్‌లోలాగానే ఇందులో కూడా అవినీతి నిర్మూలన అనే కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాను తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో తీయాలని చిత్ర నిర్మాత భావిస్తున్నట్టు తెలిసింది.
 
శంకర్ దర్శకత్వంలో, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో 'భారతీయుడు 2' త్వరలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తాజాగా వెల్లడించారు. ఈ సినిమాకుగాను డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్‌లతో కలసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం శంకర్ "2.0" సినిమా షూటింగ్‌లో బిజీ ఉండగా, కమల్ "విశ్వరూపం 2", "శభాష్ నాయుడు" చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తి కాగానే 'భారతీయుడు 2' సెట్స్‌పైకి వెళ్తుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ నటుడు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్