తమ కుమారుడు కోసం విడిపోయిన (మాజీ) దంపతులు ఒక్కటయ్యారు. ఈ మాజీ దంపతులు ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. పైగా, గర్వంగా ఉన్న తల్లిదండ్రులం అంటూ హీరో తన ఇన్స్టా ఖాతాలో ట్వీట్ చేయడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికిలోను చేస్తుంది. ఇంతకీ ఆ మాజీ దంపతులు ఎవరో కాదు.. కోలీవుడ్ దర్శకుడు ధనుష్, ఆయన మాజీ భార్య, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్. వీరిద్దరూ చాలా కాలం తర్వాత మళ్లీ ఒకచోట కనిపించారు. తమ కుమారుడు యాత్ర పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకలు ఈ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఈ సందర్భంగా ధనుష్ తన ఇన్స్టా ఖాతాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఇందులో ఆయన ఐశ్వర్య తమ కుమారుడుని ఆలింగనం చేసుకుని అభినందిస్తున్న ఫోటో ఉంది.
కాగా, 18 యేళ్ల వైవాహిక బంధం తర్వాత ధనుష్ - ఐశ్వర్యలు గత 2022 జనవరి 17వ తేదీన తాము విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా 18 యేళ్ల మా ప్రయాణం సాగింది. ఈ ప్రయాణంలో ఎదుగుదల, అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం ఉన్నాయి. ఈ రోజు మాదారులు వేరవుతున్నాయి. మేమిద్దరం దంపతులుగా విడిపోయి వ్యక్తులగా మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించి, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన గోప్యతను మాకు ఇవ్వండి అని వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన విషయం తెల్సిందే.