Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

Advertiesment
dhanush - aishwarya

ఠాగూర్

, గురువారం, 28 నవంబరు 2024 (12:33 IST)
టాలీవుడ్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ల వివాహ బంధం ముగిసిపోయింది. వీరిద్దరికీ చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 20 యేళ్ల పాటు సాగిన వైవాహిక బంధం తెగిపోయింది. గత 2004లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వేధ్, లింగా అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత 2022లో ఈ జంట విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ధనుష్ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు.. కలిసి వుండేందుకు ప్రయత్నించాలని సూచించింది. అయితే, తాము కలిసి జీవించలేమని, అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలంటూ వారిద్దరూ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి శుభాదేవి వారికి విడాకులు మంజూరు చేస్తూ బుధవారం తుదితీర్పును వెలువరించింది. 
 
అయితే, వారిద్దరినీ కలిపేందుకు, సర్ది చెప్పేందుకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలిచంలేదు కదా, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ధనుష్, ఐశ్వర్యల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?