Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''ధడక్'' ద్వారా శ్రీదేవి కుమార్తె ''జాహ్నవి'' తెరంగేట్రం..

అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి వేళైంది. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో జాహ్నవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రా

''ధడక్'' ద్వారా శ్రీదేవి కుమార్తె ''జాహ్నవి'' తెరంగేట్రం..
, శనివారం, 20 జనవరి 2018 (14:08 IST)
అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి వేళైంది. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో జాహ్నవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని జలై20వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 
 
శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అగ్రకులానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మధ్య కలిగిన ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతామని కరణ్ జోహార్ అన్నారు. జీ స్టూడియోస్, ధర్మా మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్మను విమర్శించడం ఎందుకు.. ప్రభాస్ పెళ్లి గురించి?: కృష్ణంరాజు