Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ షోపై కమెడియన్ పృధ్వీ.. నిద్రలో వెళ్లి ఎవరి పక్కనైనా పడుకుంటే?

బిగ్ బాస్ షోపై కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్స్ చేశాడు. బిగ్‌బాస్ షో ఎవరికి ఉపయోగం? అని పృధ్వీ అడిగాడు. జనాల్ని పిచ్చోళ్లని చేయడం.. వాడొచ్చి దీన్ని గిల్లాడు.. వీడొచ్చి దాన్ని గిల్లాడు.. బాస్ మిమ్మల్ని

బిగ్ బాస్ షోపై కమెడియన్ పృధ్వీ.. నిద్రలో వెళ్లి ఎవరి పక్కనైనా పడుకుంటే?
, శనివారం, 4 ఆగస్టు 2018 (12:03 IST)
బిగ్ బాస్ షోపై కమెడియన్ పృధ్వీ సంచలన కామెంట్స్ చేశాడు. బిగ్‌బాస్ షో ఎవరికి ఉపయోగం? అని పృధ్వీ అడిగాడు. జనాల్ని పిచ్చోళ్లని చేయడం.. వాడొచ్చి దీన్ని గిల్లాడు.. వీడొచ్చి దాన్ని గిల్లాడు.. బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి. వేరే పనీపాటా ఏమీ లేదా? డబ్బులు తీసుకుని ఇవా చూపించేది? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. 
 
అందరూ ఒకేచోట నిద్రించడం ఎంతకష్టమని పృధ్వీ అన్నాడు. తనకైతే అలా కష్టమని, తనకు నిద్రలో లేచే అలవాటుందని, నిద్రలో వెళ్లి ఎవరిపక్కనైనా పడుకుంటే రేపు పొద్దున పెద్ద గొడవ అంటూ పృధ్వీ వ్యాఖ్యానించాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తనకు అవకాశం వస్తే లోపల ఉన్న వాళ్లని క‌డిగి పారేస్తా. బిగ్‌బాస్ షోలో కరెక్ట్ మజా ఉండాలంటే పోసాని కృష్ణ మురళి, పృధ్వీరాజ్ రావాలి. ఇలాంటి వాళ్లు వస్తే కడిగిపారేసేవాళ్లమని పృధ్వీ ఫైర్ అయ్యాడు. 
 
బిగ్ బాస్ షో ఎలా వుంటుందంటే..? ఒక పెళ్లి జరుగుతా ఉంటుంది. ఇప్పుడంటే హోటల్స్, క్యారావ్యాన్స్, గతంలో ఇవేమీ ఉండేవి కాదు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా మండపంలో కూర్చునేవాళ్లు. వారిలో ఒకడికి పెళ్లైనా.. అంతకుముందు ప్రేమించిన అమ్మాయి కనిపిస్తుంది. అర్థరాత్రి వీళ్లిద్దరూ ఎవరికీ కనిపించకుండా మాట్లాడుకుంటుంటారు. ఇదే బిగ్‌బాస్ షో.. అంటూ పృధ్వీ ఎద్దేవా చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు జాతే కాదు.. దేశమంతా ఎన్టీఆర్‌కు రుణపడి ఉంది : బాలకృష్ణ