Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీకేయ సీక్వెల్‌లో కలర్స్ స్వాతి గెస్టు రోల్‌

కార్తీకేయ సీక్వెల్‌లో కలర్స్ స్వాతి గెస్టు రోల్‌
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:32 IST)
''కార్తికేయ'' సినిమాకు సీక్వెల్ రానుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్‌లో కలర్స్ స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత హీరో నిఖిల్‌కి కూడా మంచి ఇమేజ్ దక్కింది.
 
'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో త్రిష చెల్లిగా.. అమాయకమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది స్వాతి. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అందులో ఒకటి కార్తికేయ. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ 2 రాబోతోంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం.
 
ఇప్పటికే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుంది. రాక్షసుడు తర్వాత తెలుగులో ఆమె నటిస్తోన్న సినిమా ఇదే. కథ పరంగా మొదటి భాగంలో ఉండే హీరో పాత్ర మాత్రమే ఉంటుందని, మిగిలిన పాత్రలన్నీ మారిపోతాయని మరో టాక్‌ వినిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‍డౌన్‌లో కేకపుట్టిన రాధికా ఆప్టే... జానాబెత్తెడు బికినీలో అందాల ఆరబోత