యువ హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతిని ప్రదానం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కానుక ఇచ్చారు. "విశ్వంభర" సెట్స్లో ఉన్న చిరంజీవిని కలిసేందుకు శ్రీలీల వచ్చారు. ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఉమెన్స్ డే విషెస్ చెప్పారు. ఆమెకు చిరంజీవి దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను బహుకరించారు.
చిరంజీవి నుంచి అందిన గిఫ్టుతో శ్రీలీల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులైపోయింది. ఈ సందర్భంగా శ్రీలీల చిరంజీవితో ఒక మెగా సెల్ఫీ తీసుకుని సంతోషంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. కాగా,శ్రీలీల తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్న విషయం తెల్సిందే.