Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్
, బుధవారం, 26 ఆగస్టు 2020 (20:13 IST)
కరోనా వైరస్ బారినపడి పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ఎస్పీ బాలును ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స చేస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ అనురాధ భాస్కరన్ తెలిపారు. 
 
బాలు స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులెటెన్‌లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం సునిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఈ నెల 5వ తేదీన కరోనా వైరస్ బారినపడటంతో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి చేరిన విషయం తెల్సిందే. అప్పటినుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకు నేను ఒప్పుకోవడంలేదని మా నాన్న నన్ను చంపేస్తానంటున్నాడు: నటి ఆందోళన