Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూవివాద కేసులో నిర్మాత సి.కళ్యాణ్‌పై కేసు

భూవివాద కేసులో నిర్మాత సి.కళ్యాణ్‌పై కేసు
, మంగళవారం, 29 జూన్ 2021 (13:10 IST)
హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట భూవివాదంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆస్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. 
 
అయితే సోమవారం సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు. స్వరూప్‌ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితోపాటు సి.కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ 31 లేడీస్ నైట్ : విశ్వక్‌సేన్‌తో రకుల్ ప్రీత్ సింగ్