Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోనీకపూర్ ఊర్వశిని తాకరాని చోట తాకాడా... కానీ జెంటిల్మెన్ అంటోదిగా?

బోనీకపూర్ ఊర్వశిని తాకరాని చోట తాకాడా... కానీ జెంటిల్మెన్ అంటోదిగా?
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (13:25 IST)
50 ఏళ్ల పాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ, దక్షిణాదిన ఇతర భాషలకు చెందిన సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ చూరగొంది. అలా హీరోయిన్‌గా రాణించిన శ్రీదేవి 1996వ సంవత్సరం బోనీ కపూర్‌ను వివాహం చేసుకుని.. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు తల్లిగా మారింది. 
 
అయితే దుబాయ్‌లో బాత్‌టబ్‌లో మునిగి శ్రీదేవి గత ఏడాది 24వ తేదీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. భార్యను కోల్పోయిన బోనీ కపూర్.. ఇప్పుడిప్పుడే సినిమాలపై దృష్టి పెట్టారు. నిర్మాణ సారథ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే కుమార్తె జాన్వీని అగ్రహీరోయిన్ చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.  
 
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీ కపూర్ ప్రస్తుతం వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రముఖ నటీమణి ఊర్వశిని తాకరాని చోట తాకినట్లు బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేగాకుండా దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు బోనీకపూర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
webdunia
  
 
అయితే ఈ వీడియోపై ఊర్వశి స్పందించింది. ఇంత నీచంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించింది. బోనీ కపూర్ జెంటిల్‌మెన్ అని కితాబిచ్చింది. చెత్తచెత్త వార్తలను ప్రచురించడాన్ని మీడియా ఆపాలని.. సోషల్ మీడియాలో జనాలు మరీ ఓవరాక్షన్ చేస్తున్నారని ఫైర్ అయ్యింది. బోనీ కపూర్‌తో పాటు తనపై వస్తున్న వార్తలను ఆపేయాలంటూ డిమాండ్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంద్రగంటితో నానీ ‘వ్యూహం’