Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాదికి దాసోహం అవుతున్న బాలీవుడ్

దక్షిణాదికి దాసోహం అవుతున్న బాలీవుడ్
, బుధవారం, 13 మార్చి 2019 (14:46 IST)
ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ చిన్నచూపు చూసేది. కానీ పరిస్థితి ఇప్పుడు బాగా మారిపోయింది. దక్షిణాదిలో ఏ సినిమా రిలీజై విజయం సాధించినా రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ జనాలు ఇక్కడకు వచ్చి వాలిపోతున్నారు. ఇక్కడి కథలు కూడా హిందీలో ఘన విజయం సాధిస్తుండటంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల్లో మార్పు వచ్చింది. 
 
అయితే హిందీలోకి రీమేక్ చేయబడిన తొలి దక్షిణాది సినిమాగా 'రాముడు భీముడు' రికార్డుకెక్కింది. అప్పటి నుండి బాలీవుడ్‌లో తెలుగు సినిమాల హవా ప్రారంభమైంది. సూర్య నటించిన గజినీ సినిమా బాలీవుడ్‌లో 100 కోట్లు వసూలు చేసింది. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. తెలుగు అగ్ర హీరోలు నటించిన అనేక చిత్రాలు బాలీవుడ్‌లో కూడా ఘన విజయం సాధించాయి.
 
మహేష్ బాబు 'పోకిరీ'ని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా, విక్రమార్కుడు సినిమాను అక్షయ్ కుమార్, టెంపర్ సినిమాను రణ్‌వీర్ సింగ్ రీమేక్ చేసి హిట్టు కొట్టారు. తాజాగా టాలీవుడ్ సంచలన విజయాలు ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి సినిమాలు, కన్నడలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన కిరాక్ పార్టీ సినిమా కూడా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూరి హీరోయిన్ పిచ్చెక్కిస్తోంది... మరి అంతేగా...