Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాపు బొమ్మ ప్రణీతను వరిస్తున్న బాలీవుడ్ ఆఫర్లు..

Advertiesment
Bollywood
, శనివారం, 5 డిశెంబరు 2020 (18:21 IST)
బెంగళూరు భామ ప్రణీతకు టాలీవుడ్‌లో అంతగా ఆఫర్లు రావట్లేదు. అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత ఆమెకు ఆఫర్లు అతకడం లేదు. తాజాగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే ప్రణీతకు.. బీటౌన్‌లో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకులతో పాటు.. విష్ణు, మనోజ్, సిద్ధార్థ్ వంటి కథానాయకులతోనూ నటించిన ప్రణీతను బాలీవుడ్ అవకాశాలు వరిస్తున్నాయి.
 
ప్రస్తుతానికి బాలీవుడ్‌లో మాత్రం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అందులో ఒకటి అజయ్‌ దేవగణ్‌తో 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా' కాగా.. మరొకటి పరేష్ రావెల్, శిల్పా శెట్టిల 'హంగామా-2'. ఈ రెండు సినిమాలలోనూ ప్రాధాన్యత గల పాత్రలలో కనిపించబోతుందట ఈ బెంగళూరు భామ.
 
ఈ సినిమాలతో పాటు లేటెస్ట్‌గా మరో బాలీవుడ్ ఆఫర్ ప్రణీత చెంతకు వచ్చిందట. 'భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా'లో కీలక పాత్రకే పరిమితమైన ప్రణీత.. ఈసారి అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్‌గా నటించే ఆఫర్ చేజిక్కించుకుందట. త్వరలోనే.. అజయ్-ప్రణీత మూవీపై అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా.. బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో బిజీ అవుతోన్న ప్రణీతకు.. హిందీ చిత్ర పరిశ్రమ ఎలా కలిసొస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెబ్ సిరీస్‌పై దృష్టి పెట్టిన గోవా బ్యూటీ ఇలియానా?