Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ తెలుగు సీజన్‌-5: ఫైనల్ కంటెస్టెంట్లు వీరే

Advertiesment
Bigg Boss Telugu Season 5
, బుధవారం, 25 ఆగస్టు 2021 (12:16 IST)
కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 4 సీజన్‌లు సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడంతో ఈసారి సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
 
ప్రేక్షకుల అంచనాలను తగ్గట్టుగానే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఈ షో సెప్టెంబర్ 5న ప్రారంభంకానుంది. ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్‌ క్వారంటైన్‌లో ఉండగా షో ప్రారంభంకాకముందే టాప్ 5కి వెళ్లే వారు వీరేనని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
 
ఇక ఫైనల్ కంటెస్టెంట్స్‌లో లీస్ట్‌లో యాంకర్ రవి, యాంకర్ లోబో, షణ్ముఖ్‌ జశ్వంత్, వీజే సన్నీ, అనీ మాస్టర్, లహరి సహ్రి, సరయు, మనాస్, ఆర్కే కాజల్ ఉన్నట్లు తెలుస్తోండగా వీరిలో టాప్‌ 5కి వెళ్లే వారు ఎవరనేదానిపై నెటిజన్లు అంచనా వేస్తూ అందుకు గల కారణాలను చెబుతున్నారు.
 
ఉన్న కంటెస్టెంట్స్‌లో యాంకర్ రవి,షణ్ముఖ్ జశ్వంత్‌ మధ్య పోటీ ఉంటుందని వీరిద్దరూ టాప్ 5లో నిలవడమే కాదు ఫైనల్ రేసులో పోటీ పడతారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. 
 
మిగితా కంటెస్టెంట్స్‌తో పోలీస్తే తెలుగు రాష్ట్రాల్లో రవి,జశ్వంత్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రకారం వీరే చివరి వరకు వీరే హౌస్‌లో ఉంటారని చెబుతున్నారు. మరి నెటిజన్లు షో ప్రారంభంకాక ముందే అంచనా వేసినట్లుగా వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందా లేక మరెవరైనా విజేతగా నిలుస్తారా అనేది వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుణ్ తేజ్ విడుద‌ల చేసిన 101 జిల్లాల అంద‌గాడు ట్రైల‌ర్‌