Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ మూడో సీజన్.. పార్టీ చేసుకుంటున్న శివజ్యోతి.. ఫినాలేకు మెగాస్టార్?

బిగ్ బాస్ మూడో సీజన్.. పార్టీ చేసుకుంటున్న శివజ్యోతి.. ఫినాలేకు మెగాస్టార్?
, సోమవారం, 28 అక్టోబరు 2019 (12:04 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ చివరి దశకు చేరుకుంది. తాజాగా శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. 
 
వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు. అయితే, గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని సమాచారం. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్‌కే అధికంగా ఉన్నాయని టాక్.
 
ఇకపోతే.. ప్రముఖ వీ6 ఛానెల్ తీన్ మార్ యాంకర్ సావిత్రి అలియాస్ శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి బటయకు వచ్చేసింది. 14వ వారం చివర బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె హౌస్ నుంచి బయటకు రాగానే ఏమాత్రం ఫీల్ అవ్వకుండా హ్యీపీగా పార్టీ చేసుకుంది. 
 
బిగ్ హౌస్‌లో పరిచయం అయిన ఫ్రెండ్స్‌తో శివజ్యోతి దీపావళి సంబరాలు చేసుకుంది. మునిగిపోయింది. ఆమెకు హౌస్ లో ఫ్రెండ్స్ అయినా అశు రెడ్డి, రవి కృష్ణ, రోహిణి, హిమజతో పాలు కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంది శివజ్యోతి. వీరంతా సందడిగా టపాసులు పేల్చుతూ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ట్వీట్.. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన దేవునికి ధన్యవాదాలు..