Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'భరత్ అనే నేను' అంటూ కుమ్మేస్తున్నాడు... 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యా

'భరత్ అనే నేను' అంటూ కుమ్మేస్తున్నాడు... 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్
, గురువారం, 26 ఏప్రియల్ 2018 (13:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.
 
అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 49 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 5 రోజుల్లో రూ.76 కోట్ల షేర్‌ను రాబట్టింది.
 
ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఏకంగా రూ.15.3 కోట్ల షేర్‌ను రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంబరబడిపోతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సముద్రాన్ని కబణించే రోజు దగ్గర్లోనే ఉంది : నటి శ్రీరెడ్డి కామెంట్స్