Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీవు మనిషివా? నాగబాబువా?: పవన్ కళ్యాణ్ పైన శ్రీరెడ్డి సెటైర్లు

నీవు మనిషివా? నాగబాబువా?: పవన్ కళ్యాణ్ పైన శ్రీరెడ్డి సెటైర్లు
, శనివారం, 5 డిశెంబరు 2020 (14:20 IST)
గత కొంతకాలంగా మౌనంగా వుంటూ వచ్చిన శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు పేల్చింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో ఎందుకు నామినేషన్ వేయించారో ఎందుకు వాపసు తీసుకున్నారో అర్థంకావడం లేదన్న శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ పెద్ద తుగ్లక్ అని పేర్కొంది.
 
ట్విట్టర్లో ఒక మాట రాస్తారనీ, మైకులో ఇంకోటి చెపుతారని ఎద్దేవా చేసింది. పార్టీ పెట్టుకుని ఫండ్స్ వసూలు చేస్తున్న పవన్ కళ్యాణ్, వసూలైన ఫండ్స్ ఏమవుతున్నాయో చెప్పాలంటూ పేర్కొంది. ఒకవైపు పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుకుగా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారని విమర్సించింది. ఆయనను నమ్మి పార్టీలో పనిచేసేవాళ్లను నట్టేట ముంచుతున్నారంటూ చెప్పిన శ్రీరెడ్డి... నీవు మనిషివా నాగబాబువా అంటూ సెటైర్ విసిరింది.
 
ఇంకా నాగబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.... ప్రకాష్ రాజ్‌ను విమర్శించే హక్కు మీకు లేదని చెప్పుకొచ్చింది. నాగబాబు గారూ మీరు నటుడిగా, షో జడ్జిగా, నిర్మాతగా ఫెయిలయ్యారు. మీకు ప్రకాష్ రాజ్ ను విమర్శించే అర్హత లేదంటూ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి1న ‘ఒరేయ్‌ బుజ్జిగా...`