Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

''క్షణం'' సినిమాకు నామినేషన్లు.. అడివి శేషుకు, అనసూయకు అవమానం.. ఎన్టీఆర్ వెనక తోక?

జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అవార్డుల పంట పండింది. సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంలో జూ.ఎన్టీయర్ సినిమాలకు ఐదు అవార్డులు లభించాయి. శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన 64 జియో ఫిల్మ్‌ఫేర్ అ

''క్షణం'' సినిమాకు నామినేషన్లు.. అడివి శేషుకు, అనసూయకు అవమానం.. ఎన్టీఆర్ వెనక తోక?
, మంగళవారం, 20 జూన్ 2017 (13:18 IST)
జూనియర్ ఎన్టీఆర్‌కు ఈ ఏడాది అవార్డుల పంట పండింది. సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ సినిమాలకు ఐదు అవార్డులు లభించాయి. శనివారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన 64 జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాలో అత్యుత్తమ నటన కనబరిచినందుకు గాను ఎన్టీఆర్‌ను ఈ అవార్డు వరించింది.
 
ఈ ఫిలిమ్‌ఫేర్ అవార్డును అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. యమదొంగ సినిమాకు చెన్నైలో అవార్డు దక్కిందని.. అది ఎప్పటికీ మరిచిపోనన్నారు. ఫిలిమ్‌ఫేర్ అవార్డుల ఫంక్షన్లకు వచ్చే నటీమణులు గౌన్ల తరహాలో ఎన్టీఆర్ వస్తుంటే వెన్నంటి తోక వస్తుందని అదెక్కడని యాంకర్ అడిగిన ప్రశ్నకు అదేంలేదని ఎన్టీఆర్ అనే లోపే.. యాంకర్ ఎన్టీఆర్ వెంటనే వెన్నంటి వస్తున్న ఫ్యాన్స్‌ మీ వెనక తోకలా పరిగెత్తుకుంటూ వస్తారు కదా అంటూ చమత్కరించింది. 
 
ఇలా అట్టహాసంగా హైదరాబాదులో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లో హాట్ యాంకర్ అనసూయ, నటుడు అడవి శేష్‌కు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో విమర్శలొస్తున్నాయి. "క్షణం" సినిమాకు గాను అడివి శేషుకు, అనసూయకు ఫిల్మ్ ఫేర్ నామినేషన్లు దక్కాయి. అయినప్పటికీ వీరిని వేడుకకు ఆహ్వానించలేదట నిర్వాహకులు. ఈ అంశంపై అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. వేడుకలకు సరిగ్గా గంట ముందు ఫోన్ చేసిన నిర్వాహకులు క్షమాపణలు చెప్పారని తెలిపాడు. మరోవైపు, అనసూయకైతే ఇంతవరకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు వాడంటే పరమ అసహ్యం... ఎందుకు?