Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జై జగన్ అన్నవాళ్లంతా ఔట్, పవన్ కల్యాణ్‌కి లక్ష మెజారిటీ: నట్టి కుమార్

YS‌ Jagan, Nattikumar

ఐవీఆర్

, గురువారం, 9 మే 2024 (16:07 IST)
ఏపీలో జరుగునున్న ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చవిచూడబోతోందని నిర్మాత నట్టి కుమార్ జోస్యం చెప్పారు. జై జగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పక్కన తిరిగిన ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని అన్నారు. ఓడిపోయేవారిలో బొత్స సత్యనారాయణం, పేర్ని నాని, కొడాలి నాని, రోజా తదితర సన్నిహిత మంత్రులందరూ పరాజయం పాలవుతున్నారనీ, దీనితో కేవలం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే మిగులుతారంటూ జోస్యం చెప్పారు.
 
ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ లక్షా పదివేల మెజారీటీతో గెలుస్తున్నారనీ, నారా లోకేష్ 80 వేలు, చంద్రబాబు నాయుడు లక్షకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించబోతున్నారన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం 20 వేల తేడాతో విజయం సాధిస్తారనీ, ఆయన ఒక్కరు మాత్రమే ప్రతిపక్ష స్థానంలో ఒంటరిగా కూర్చోవల్సి వస్తుందన్నారు. వైసిపిలో ఎవరైనా గెలిచినా అంతా కొత్తవారే వుంటారనీ, ఆ సంఖ్య కూడా 20కి లోపే వుండబోతుందన్నారు. మొతమ్మీద ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవిచూడబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిజీగా వున్నా పర్లేదు.. ఇంట హ్యాపీగా ఆవకాయ్ పచ్చడి చేశాను..