Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సాహో' ధర రూ.550 కోట్లు... బెదిరిపోయిన బాలీవుడ్

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటి

Advertiesment
'సాహో' ధర రూ.550 కోట్లు... బెదిరిపోయిన బాలీవుడ్
, సోమవారం, 30 జులై 2018 (16:30 IST)
'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇపుడు ఎక్కడికో వెళ్లిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం "సాహో". సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. వచ్చే యేడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
 
ఈ నేపథ్యంలో ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ ఒకటి రూ.550 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి దేశవ్యాప్త హక్కుల్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ డీల్‌తో యువీ సంస్థ సినిమా పూర్తవక ముందే మంచి లాభాల్ని అందుకున్నట్టయింది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డీ... మీడియా ముందుకు రా... నేను చూపిస్తా... ఏం చేస్తావో చూస్తా? లారెన్స్