Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయసుతో సమంబంధం లేదు - ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు : ఐశ్వర్య రాయ్

Advertiesment
Aishwarya Rai Bachchan

ఠాగూర్

, మంగళవారం, 19 ఆగస్టు 2025 (18:02 IST)
వయసుతో సమంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారని ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వినియోగంపై మాట్లాడుతూ, సోషల్ మీడియా వినియోగంపై తనకు ఎంతో ఆందోళనగా ఉందన్నారు. గుర్తింపు కోసం ప్రజలంతా ఆరాటపడుతున్నారని ఇది ఏమాత్రం మచింది కాదన్నారు. 
 
సోషల్ మీడియా వినియోగం పెరిగిందన్న అంశంపై ఐశ్వర్యా మాట్లాడుతూ, సోషల్ మీడియా పోస్టులకు వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవన్నారు. మన విలువను ఏది నిర్ణయించలేదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బయట ప్రపంచానికి చూపవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. నా దృష్టిలో సోషల్ మీడియాకు, సామాజిక ఒత్తిడికి మధ్య పెద్ద తేడా లేదు. తల్లిగా నాకు ఈ విషయంలో ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు. దాన్ని దాటి చూసినపుడే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. ఆత్మగౌరవం కోసం సామాజిక మాధ్యమాల్లో వెతకొద్దు. అది ఖచ్చితంగా అక్కడ దొరకదు" అని ఐశ్వర్యా రాయ్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Faria Abdullah: సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ గుర్రం పాపిరెడ్డి సాంగ్