Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనామా పత్రాల లీక్ కేసు : ఈడీ ప్రశ్నలతో ఐశ్వర్య ఉక్కిరిబిక్కిరి

పనామా పత్రాల లీక్ కేసు : ఈడీ ప్రశ్నలతో ఐశ్వర్య ఉక్కిరిబిక్కిరి
, మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:15 IST)
పనామా పత్రాల లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆమైపై ప్రశ్నల వర్షం సంధించారు. దీంతో ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యారు. 
 
ఈ పనామా పత్రాల లీక్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. కానీ, ఆ సమయంలో ఆమె హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నట్టుండి మరోమారు విచారణకు రావాల్సిందేనంటూ నోటీసులు జారీచేశారు. 
 
అయితే, ఈ రోజు విచారణకు రాలేనని ఆమె చెప్పినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం అంగీకరించలేదు. దీంతో ఆమె సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆ సమంయలో ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆమె వద్ద విచారణ సాగింది.
 
ఈ వ్యవహారంపై ఐశ్వర్య అత్త, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే బీజేపీకి దుర్ధినాలు రానున్నాయని ఆమె శాపనార్థాలు పెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ అమ్మాయితో ప్రేమలో వున్నాను.. అడవి శేష్