Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వయంవరం ప్రకటించుకున్న హీరోయిన్.... పందెం ఏంటంటే?

స్వయంవరం ప్రకటించుకున్న హీరోయిన్.... పందెం ఏంటంటే?
, ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (18:38 IST)
టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ. తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. క్లిక్ కాలేక పోయింది. మంచి అవకాశాలు వచ్చినప్పటికీ సరైన హిట్లు లేక నిలదొక్కుకోలేక పోయింది. దీంతో సెకండ్ హీరోయిన్‌గా సైడ్ అయిపోయింది. కానీ, ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన హావభావాలతో పాటు.. చిత్ర విచిత్ర ఫీట్లు చేస్తూ నెటిజన్ల గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. 
 
తాజాగా ఆమె మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తనకుతాను స్వయంవరం ప్రకటించుకున్నారు. సరైన పెళ్లి కుమారుడు కోసం ఆమె ఈ స్వయంవరాన్ని ప్రకటించారు. ఇందులో పాల్గొనే యువకుల రంగు, కులం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇవేవీ తాను పట్టించుకోనని ట్వీట్ చేసింది. 
 
అయితే ఉల్లిపాయలు తిననివాడు అయ్యుండాలని, ముఖంపై చిరునవ్వు చెదరకుండా మూడు పూటలా వంట అతడే చేయాలని కొన్ని కండిషన్లు పెట్టింది. రెగ్యులర్‌గా షేవ్ చేసుకోవాలని, సంప్రదాయ దుస్తులే ధరించాలని షరతులు విధించింది. ఆదా శర్మ అంతటితో ఆగలేదు. మందు, మాంసం ఇంట్లోనూ, బయట నిషేధం అని స్పష్టం చేసింది.
 
పైగా, అతడికి తాగేందుకు ఐదు లీటర్ల నీటిని ప్రతి రోజూ అందిస్తానని తెలిపింది. దాంతోపాటే, భారత్‌లోని అన్ని భాషల చిత్రాలపైనా సదాభిప్రాయం కలిగి ఉండాలని, వాటిని ఆస్వాదించే మనసున్నవాడే తనను మనువాడొచ్చని ట్విట్టర్‌లో వెల్లడించింది. మొత్తానికి ఆదా శర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్లు చేసిందో కానీ, నెటిజన్లు మాత్రం భారీగా స్పందిస్తున్నారు. మరీ ఇన్ని సుగుణాలు ఉన్న వరుడు ఆమెకు దొరుకుతాడో లేదో వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్లువొచ్చి గోదారమ్మ...' లవ్‌ యూ అంటున్న పూజాహెగ్డే