Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవి కుమార్తెకు అరుదైన గౌరవం -- వరించిన ప్రతిష్టాత్మక అవార్డు

శ్రీదేవి కుమార్తెకు అరుదైన గౌరవం -- వరించిన ప్రతిష్టాత్మక అవార్డు
, సోమవారం, 10 డిశెంబరు 2018 (15:38 IST)
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు అరుదైన గౌరవం లభించింది. "రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు"కు జాన్వీకపూర్ ఎంపికైంది. ముంబైలోని నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ఈ అవార్డును జాన్వీకపూర్‌కు మంగళవారం ప్రదానం చేయనుంది.
 
నిజానికి జాన్వీ కపూర్ నటించింది కేవలం ఒకే ఒక చిత్రం మాత్రమే. "దఢక్" చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్... ఈ చిత్రంలో మంచి నటననే ప్రదర్శించింది. దీంతో ఆమెకు మంచి మార్కులు పడటమేకాకుండా, అనేక మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో 'రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'కు జాన్వీ కపూర్ ఎంపికైంది.
 
దీనిపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ, ఈ ఏడాది 'దఢక్' చిత్రంతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చా. నార్వేలో ఉన్నవారితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూశారు. నార్వే ప్రజలు సోషల్‌మీడియా ద్వారా దఢక్ చిత్రానికి ప్రశంసలు, ఆశీస్సులు అందించారు. 
 
ఇలాంటి అరుదైన గుర్తింపు రావడం ఆశ్చర్యంగా, గొప్ప అనుభూతిని కలిగించేలా ఉంది. 'రైజింగ్ ఆఫ్ ది ఇయర్ టాలెంట్ అవార్డు' రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, ఇది ఎంతో సంతోషకరమైన విషయమని ఆమె వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..