Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డేటింగ్ యాప్‌లో సంపూ హీరోయిన్ ఫోటోలు

Advertiesment
Geetanjali
, బుధవారం, 26 మే 2021 (14:52 IST)
ఇటీవలి కాలంలో సినీ హీరోయిన్ల ఫోటోలను డేటింగ్ యాప్‌లలో పోస్ట్ చేసి, వాటితో డబ్బులు సంపాదించడం చాలా మందికి అలవాటుగా మారింది. ఈ కోవలో ఇపుడు టాలీవుడ్ నటి గీతాంజలి ఫోటోలు కూడో ఓ డేటింగ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆమె హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గీతాంజలి ఫోటోలు ఓ డేటింగ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలను చూసిన ఆమె స్నేహితులు ఖంగుతిని గీతాంజలి దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై ఆమె మాట్లాడుతూ, 'డేటింగ్ యాప్‌లో నా ఫొటోలు ఉన్నట్లు నా స్నేహితురాలు కాల్ చేసి చెప్పేవరకు నాకు తెలీదు. హాట్ లైవ్ డేటింగ్ యాప్‌లో నా ఫొటో ఉన్నట్లు నాకు కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో నేను వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. సెలబ్రిటీల ఫొటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంకో అమ్మాయికి ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఒక రంగంలో ఎదుగుతుంటే కొందరు కావాలని ఇలా టార్గెట్ చేస్తారు. నాపై వ్యక్తిగతంగా అసూయ పెట్టుకుని ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నా. నా అనుమానాలకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని పోలీసులకు అందజేశాను. పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులపై నాకు నమ్మకం ఉంది. నిందితులపై కఠిన  చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈమె గతంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన "కొబ్బరి మట్ట" చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో గీతాంజలికి మంచి గుర్తింపు వచ్చింది. అందులో సంపూ భార్యల్లో ఒకరిగా నటించిన గీతాంజలి.. పప్పులో చెమటపడుతుందని చెప్పే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు. ఈమె ఇప్పటివరకు 30కి పైగా చిత్రాల్లో నటించారు.   
 
గీతాంజలి 32 సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. అయితే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమాతో గీతాంజలికి మంచి గుర్తింపు వచ్చింది. అందులో సంపూ భార్యల్లో ఒకరిగా నటించిన గీతాంజలి.. పప్పులో చెమటపడుతుందని చెప్పే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ నటి శరణ్య శశి ఆరోగ్య పరిస్థితి ఏంటి..? పట్టిపీడిస్తున్న ఆ వ్యాధి..?