Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తతో పిల్లల గురించి ప్లానింగ్ చేస్తున్నా : నటి అనిత

"నువ్వు నేను" చిత్రంలో హీరో ఉదయ్ కిరణ్‌తో జతకట్టిన భామ అనిత. ఈమెకు సినీ కెరీర్ ఆరంభంలో మంచి ఛాన్స్‌లే దక్కాయి. ఆ తర్వాత ఆఫర్లు లేక ఈ అమ్మడు బాలీవుడ్ ఫ్లైటెక్కింది.

భర్తతో పిల్లల గురించి ప్లానింగ్ చేస్తున్నా : నటి అనిత
, ఆదివారం, 10 డిశెంబరు 2017 (13:26 IST)
"నువ్వు నేను" చిత్రంలో హీరో ఉదయ్ కిరణ్‌తో జతకట్టిన భామ అనిత. ఈమెకు సినీ కెరీర్ ఆరంభంలో మంచి ఛాన్స్‌లే దక్కాయి. ఆ తర్వాత ఆఫర్లు లేక ఈ అమ్మడు బాలీవుడ్ ఫ్లైటెక్కింది. అక్కడ కూడా అనితకు సరైన అవకాశాలు రాకపోవడంతో పలు రియాలిటీ షోస్‌లో, సీరియల్స్‌లో నటిస్తూ అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తోంది.
 
ఈ క్రమంలో రోహిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత రోహిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ జంట పిల్లలు కావాల‌ని ఆశపడుతున్నారట. అనిత స్వ‌యంగా త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చిన్న పిల్లవాడి ఫొటోను షేర్ చేస్తూ.. కాప్షన్‌లో తన భర్త రోహిత్‌ శెట్టి‌తో ‘పిల్లల గురించి ప్లానింగ్ చేద్దాం’ అని ట్యాగ్ చేసింది. 
 
అనిత షేర్ చేసిన ఈ ఫొటోకు లక్షకు పైగా లైక్‌లు రాగా, 280 కామెంట్లు వచ్చాయి. ప్ర‌స్తుతం ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న అనిత చివ‌రిగా తెలుగులో "మ‌న‌లో ఒక‌డు" అనే చిత్రం చేసింది. ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టించి, సంగీతం అందించ‌డంతో పాటు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో జరిగే విషయాలు మీడియాకెలా లీక్ అవుతున్నాయి : చిరంజీవి ఆరా