Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుంభకోణంలో ఘోర ప్రమాదం: ప్రభుదేవా కొత్తప్రాజెక్టు సభ్యులు ఇద్దరు మృతి

కుంభకోణంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాకు చెందిన కొత్త సినిమా యూనిట్ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ''యంగ్ మంగ్ చంగ్'' అనే తమిళ సినిమా షూటంగ్ కుంభకో

Advertiesment
Prabhu Deva
, శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:29 IST)
కుంభకోణంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవాకు చెందిన కొత్త సినిమా యూనిట్ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ''యంగ్ మంగ్ చంగ్'' అనే తమిళ సినిమా షూటంగ్ కుంభకోణంలో జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, తంగర్‌బచ్చన్, లక్ష్మీమీనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం 15 రోజుల పాటు ఈ సినిమా గ్రూప్ తిరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం తిరువైయారులోని అయ్యారప్పర్ ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు గానూ యూనిట్ సభ్యులంతా బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని వ్యానులో తిరువైయారుకు బయల్దేరారు. అయితే కుంభకోణం-తిరువైయార్ రోడ్డు.. కరుప్పురు గ్రామం, కబిస్థలం సమీపంలో వ్యానును భారీ లోడ్‌తో వచ్చిన లారీ వేగంతో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యూనిట్ సభ్యులు మరణించారు. 
 
విజయ్ కుమార్ (43), డ్రైవర్ ఆరుముగం (53) తీవ్రగాయాలతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకా గాయపడిన సభ్యులను తంజావూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కబిస్థలం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇకపోతే.. ఈ విషయం తెలియగానే బాధితులను తంజావూర్ మెడికల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు ప్రభుదేవా. ఈ దుర్ఘటన ప్రభుదేవా టీమ్‌ని తీవ్రంగా కలిచివేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్