తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ''రోబో''. దీనికి సీక్వెల్గా ''రోబో 2.0'' తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు.
భారత సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. అందమైన లోకేషన్స్లో, భారీ బడ్జెట్తో, భారీ విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులకోసం దర్శకుడు ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నిర్మాతలు కూడా ఈ చిత్రం విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం మొత్తం ఏడు పేరు మోసిన సంస్థల నుంచి వందల మంది బృందాలుగా ఏర్పడి పనులు మొదలుపెడుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.