Publish Date: Sun, 05 Apr 2026 (21:22 IST)
Updated Date: Sun, 05 Apr 2026 (21:24 IST)
ప్రేమపై సినీ నటి త్రిష ఆసక్తికర పోస్టు చేశారు. ప్రేమ అనేది సర్వస్వం కాదని.. కానీ అది లేకుండా అంతా శూన్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ పోస్టు చూసిన వారంతా ఆమె ఎవరితోనూ ప్రేమలో వుందని అందుకే ఇలాంటి పోస్టు పెట్టిందని అంటున్నారు. దీనితో పాటు ఆమె పంచుకున్న రెండు వీడియో కోట్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను ఇప్పుడు జీవితంలో ఒక కొత్త దశలోకి ప్రవేశించానని అనవసరమైన వాదనలకు దూరంగా వుండటమే తన ప్రస్తుత సూత్రమని ఆమె పేర్కొన్నారు.
జీవితంలో తాను ఇప్పుడు ఎవరితోనూ వాదించని స్థితిలో ఉన్నానని త్రిష తెలిపింది. ఒక వేళ మీరు ఏనుగు ఎగురుతుందని చెబితే.. అవును మీరు చెప్పింది నిజమే అని చిరునవ్వుతో ఒప్పేసుకుంటాను అంటూ త్రిష తెలిపింది. ఎందుకంటే మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక, ఆసక్తి తనకు లేవు.
సరైనదిగా నిరూపించుకోవడం కంటే మనశ్శాంతి చాలా విలువైనదని తాను నేర్చుకున్నానని.. వివరణలు ఇవ్వడం కంటే మౌనంగా ఉండటమే మేలు. ప్రతి ఒక్కరూ మన శక్తిని పొందేందుకు అర్హులు కారని త్రిష ఎంతో లోతైన అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. ఎదుగుదల అంటే గట్టిగా అరవడం కాదని, కొన్నిసార్లు నిశ్శబద్ధంగా వుండటమేనని త్రిష అభిప్రాయపడ్డారు.