Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'బిగ్‌బాస్' స్థానంలో రియాలిటీ డాన్స్ షో... న్యాయ నిర్ణేతలుగా 'ఆ ముగ్గురు'

హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ప్రసారమవుతున్న 'బిగ్‌బాస్' రియాల్టీ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ షో స్థానంలో మరో రియాల్టీ షోను ప్రసారం చేసేందుకు 'స్టార్ మా' యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

'బిగ్‌బాస్' స్థానంలో రియాలిటీ డాన్స్ షో... న్యాయ నిర్ణేతలుగా 'ఆ ముగ్గురు'
, బుధవారం, 20 సెప్టెంబరు 2017 (12:26 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ప్రసారమవుతున్న 'బిగ్‌బాస్' రియాల్టీ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. ఈ షో స్థానంలో మరో రియాల్టీ షోను ప్రసారం చేసేందుకు 'స్టార్ మా' యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో ఈ రియాల్టీ షో కోసం హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను ప్రధాన న్యాయ నిర్ణేతగా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఇపుడు మరో ఇద్దరిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
 
వీరిలో ఒకరు జానీ మాస్టర్ కాగా, మరొకరు హీరోయిన్ ఆదాశర్మ. అయితే, జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఆదా శర్మ విషయానికి వస్తే.. ఈమె టాలీవుడ్ హీరోయిన్‌ అని మాత్రమే ఆమెను ఎంపిక చేయలేదట. ఈమెకు కథక్ నృత్యంలోనూ.. వెస్ట్రన్ డాన్సుల్లోను ఆమెకి మంచి నైపుణ్యం ఉందట.
webdunia
 
ఈ కారణంగానే ఆమెను తీసుకోవడం జరిగిందని చెబుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రోమోలను త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ రియాల్టీ షోను స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న "నాచ్ బలియే" తరహాలోనే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్జీవీ అరెస్టుకు విజయవాడ కోర్టు ఆదేశం... ఏ క్షణమైనా...