Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రభాస్ - రానా కలిసి మరో సినిమా చేయనున్నారా? డైరెక్టర్ ఎవరో తెలుసా?

ప్రభాస్ - రానా కలిసి మరో సినిమా చేయనున్నారా? డైరెక్టర్ ఎవరో తెలుసా?
, సోమవారం, 18 మే 2020 (17:28 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దగ్గుబాటి రానా కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి చరిత్ర సృష్టించడం తెలిసిందే. బాహుబలి తర్వాత ఓ వైపు ప్రభాస్, మరోవైపు రానా ఇద్దరూ వేరే సినిమాలతో బిజీ అయ్యారు.
 
ఈ ఇద్దరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ... కెరీర్లో దూసుకెళుతున్నారు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ - రానా కలిసి సినిమా చేయనున్నారు అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. 
 
ఇంతకీ విషయం ఏంటంటే... ప్రభాస్‌తో దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా తీసారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది.
 
అయితే... మిస్టర్ పర్ఫెక్ట్ తీసిన దర్శకుడు దశరథ్ ఇటీవల ప్రభాస్‌కి ఓ కథ చెప్పారని తెలిసింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు రానా అయితే కరెక్ట్‌గా సరిపోతాడని.. రానాని కాంటాక్ట్ చేసి కథ చెప్పాడని టాక్. ఈ కథ విని రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
 
 దీంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను నటించిన హీరోలందరితోనూ క్వారంటైన్‌లో ఉంటా : పూజా హెగ్డే