Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునకు షాకిచ్చిన మోహన్ బాబు.. విష్ణు - రాజ్‌తరుణ్‌లతో 'గుండమ్మ కథ తీస్తారట!

Advertiesment
Mohan Babu
, మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (14:56 IST)
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'ఈడోరకం ఆడోరకం' సక్సెస్ మీట్‌లో చేసిన సంచలన వ్యాఖ్యలు నాగార్జునకు షాక్ నిచ్చాయి. మెగా హీరోలపై ఇన్ డైరెక్ట్‌గా సెట్టైర్లు వేసిన మోహన్ బాబు... టాలీవుడ్ మన్మథుడిని సైతం వదిలిపెట్టలేదు. అక్కినేని నాగార్జున కలల ప్రాజెక్ట్ "గుండమ్మ కథ". ఈ సినిమాను ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాడు. అయితే సినిమాపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కన్నేశాడు. 
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాగ చైతన్యలు హీరోలుగా నాగార్జున అలనాటి ఆణిముత్యం "గుండమ్మ కథ" సినిమాను తెరకెక్కించాలని భావిస్తుంటే, రీమేక్ చిత్రంగా మంచు విష్ణు, రాజ్ తరుణ్‌ల కాంబినేషన్‌లో తీసే ఆలోచన చేస్తున్నాను అంటూ మోహన్ బాబు తన మనసులో మాట బయట పెట్టాడు.  విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఈడోరకం ఆడోరకం' హిట్ అయిన కారణంతో మోహన్ బాబుకి ఈ ఆలోచన వచ్చిందట. 
 
ఈ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ వీరిద్దరి కాంబినేషన్ చూశాక తనకు వీరిద్దరితో 'గుండమ్మ కథ' సినిమాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిందని ఆ సినిమా హక్కులను కొనడానికి ప్రయత్నిస్తాను అంటూ అందరికీ ఒక షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. అంతేకాదు ఈ రీమేక్‌ను కూడ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలోని నిర్మిస్తాను అంటూ మరో షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. 
 
ఈ ఫంక్షన్‌కు అతిథిగా విచ్చేసిన దాసరి మాట్లాడుతూ మరో షాక్ ఇచ్చాడు. హీరోల్ని కాకుండా కథల్ని నమ్మి సినిమాలు చేయాలి అని అంటూ 'ఈడోరకం ఆడోరకం' అలాంటి సినిమానే అని తెలిపారు. విష్ణు సక్సెస్ చూసి మోహన్ బాబు ఎంత సంతోషిస్తాడో నేను అంతే సంతోషిస్తాను అని పలుకుతూ సినిమాలు హిట్ అవుతున్నాయని హీరోలు రేట్లు పెంచేసి నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటూ దాసరి హితవచనాలు పలికారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన పెళ్ళి మాట ఎత్తవేం..?