Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా మూవీ.. ఆమెను తీసుకుంటే?

rekha
, బుధవారం, 1 మార్చి 2023 (16:24 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎప్పటిలాగానే త్రివిక్రమ్ సీనియర్ నటిని రంగంలోకి దించనున్నారు. మహేష్ 28వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా కనిపిస్తారని టాక్ వస్తోంది. 
 
ఇక తన సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్‌ను తీసుకుంటూ వుంటాడనే సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, టబూలను తన సినిమాల్లో నటింపజేసి త్రివిక్రమ్.. తన తాజా చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖను తీసుకోనున్నట్లు సమాచారం. 
 
ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ ఖాతాలో తొలి పాన్ ఇండియా చిత్రంగా మారనుంది. అలాగ సంగీతం .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైంటిఫిక్ మిస్టరీ నేపథ్యంలో కరాళ