Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'చంద్రముఖి' సీక్వెల్‌లో హీరోయిన్‌గా బాలీవుట్ భామ!!

Advertiesment
Kiara Advani
, మంగళవారం, 28 జులై 2020 (17:00 IST)
గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు పి.వాసు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'చంద్రముఖి'.ఈ చిత్రంలో హీరోయిన్‌గా జ్యోతిక, నయనతారతో పాటు మరికొందరు నటీమణులు నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ చిత్రం సీక్వెల్ రానుంది. 
 
ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఈయనకు జోడీగా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. చంద్రముఖి ఫస్ట్‌పార్ట్‌లో ప్లాష్‌బ్యాక్‌లో రజనీ వేట్టయ్యన్‌ అనే దుష్ట మహారాజుగా నటించారు.
 
రాజ నర్తకి చంద్రముఖి నిండు సభలో నృత్యం చేస్తుండగా ఆమె ప్రియుడిని వేట్టయ్యన్‌ అనే మహారాజు చంపుతాడు. వేట్టయ్యన్‌, రాజనర్తకి చంద్రముఖి నడుమ జరిగే ఘర్షణల నేపథ్యంలో కొత్త కథ తయారు చేసి దర్శకుడు వాసు ‘చంద్రముఖి-2’ను రూపొందించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కియారాను ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వీడియోలో త్రిష బాగోతమంతా ఉంది... త్వరలో రిలీజ్ : మీరా మిథున్