Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వై.ఎస్.ఆర్ బ‌యోపిక్‌లో మ‌రో తెలుగు న‌టుడు..?

వై.ఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో వై.ఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ అగ్ర‌హీరో మ్ముట్టి పోషిస్తున్నారు. మ‌హి వి రాఘ‌వ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుం

Advertiesment
Jagapathy babu
, సోమవారం, 2 జులై 2018 (12:49 IST)
వై.ఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో వై.ఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ అగ్ర‌హీరో మ్ముట్టి పోషిస్తున్నారు. మ‌హి వి రాఘ‌వ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో ఓ మ‌హిళా నాయ‌కురాలు పాత్ర‌కు అన‌సూయ‌ను తీసుకున్నారు. తాజాగా మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది  ఏంటంటే... ఈ సినిమాలో న‌టించేందుకు తెలుగు న‌టులు అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌. 
 
ఇందులో న‌టిస్తోన్న తెలుగు యాక్ట‌ర్ రావు ర‌మేష్. లేటెస్ట్‌గా మ‌రో యాక్ట‌ర్ ఇందులో న‌టించేందుకు ఓకే చెప్పార‌ట‌. అత‌నే జ‌గ‌ప‌తిబాబు. అవును జ‌గ‌ప‌తి ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే అన్నారని తెలిసింది. ఆయ‌న వై.ఎస్ తండ్రి రాజారెడ్డి పాత్ర‌ను పోషిస్తున్నార‌ట‌. నాజ‌ర్ కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తోన్న ఈ సినిమాని జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రిలో ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా వ‌స్తోంది. మ‌రి... ఈ పోటీలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్‌లో ''మహానటి''గా కీర్తి సురేష్?