Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌హేష్‌బాబుకు విల‌న్ ఫిక్స్ అయిన‌ట్లే!

మ‌హేష్‌బాబుకు విల‌న్ ఫిక్స్ అయిన‌ట్లే!
, మంగళవారం, 1 జూన్ 2021 (21:52 IST)
Arjun
మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌తో కలిసి ఘట్టమనేని మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
 
ఈ సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మ‌హేష్‌బాబు, హీరోయిన్‌తోపాటు కుటుంబ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. కానీ విల‌న్‌కు సంబంధించిన స‌న్నివేశాలు ఇంకా తీయ‌లేదు. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కులుగా కొంద‌రు పేర్లు ప‌రిశీల‌న‌లో వున్నాయి. క‌న్న‌డ స్టార్ సుదీప్‌, ఉపేంద్రతో పాటు త‌మిళ న‌టుడు అర‌వింద్ స్వామికూడా వున్నారు. ఓ ద‌శ‌లో బాలీవుడ్‌నుంచి అనిల్‌క‌పూర్ ను కూడా సంప్ర‌దిస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా స‌మాచారం మేర‌కు యాక్ష‌న్ కింగ్ అర్జున్ పేరు ముందుకు వ‌చ్చింది. విశాల్ సినిమా అభిమ‌న్యుడు సినిమాలో ఆయ‌న న‌ట‌న స్ట‌యిలిష్‌గా వుంది. అందుకే ఆయ‌న పేరు చిత్ర యూనిట్ ప‌రిశీలిస్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లో వీటిపై క్లారిటీ రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో తాగుబోతుల బారిన ప‌డ్డ‌ ప్రాచీ